గుంటూరులో నిబంధనలతో కూడిన లాక్‌డౌన్, ఇక్కడ మాత్రమే ఎందుకని?

Written By వి
Updated: శుక్రవారం, 17 జులై 2020 (14:30 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. కేసులతో పాటు మరణాలు కూడా అధికమవుతున్నాయి. ఏపీలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటివరకు 5000 మందికి పైగా కరోనా వ్యాధి బారినపడ్డారు.
 
వీరిలో 1829 మంది కరోనా మహమ్మారిని జయించగా ఇప్పటివరకు 32 మంది కరోనాకు బలైపోయారు. ఈ క్రమంలో కరోనాను అడ్డుకోవడానికి శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ వెల్లడించారు. నిత్యావసర సరకుల కోసం ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి కలదని స్పష్టం చేసారు.
 
ఇలా పూర్తిగా వారం రోజులపాటు లాక్ డౌన్ ఉంటుందని, అవసరమైతే తప్ప మిగతా విషయాలకు బయటకురావద్దని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. 
 

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments