సంబంధిత వార్తలు
- భారత్లో 14వేల మార్కును దాటిన కరోనా కేసులు
- టచ్లోకి వచ్చిన రోహిత్ శర్మ : టీ20 వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చిత్తు
- మేడం టూసాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం
- India Corona: అదుపులోనే మహమ్మారి.. కానీ పెరిగిన మృతుల సంఖ్య
- ప్రసిద్ధ రచయిత అమిష్ త్రిపాఠి కథలను ఇప్పుడు అన్ని భారతీయ భాషలలో వినవచ్చు
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 100 కోట్ల చేరువలో...
కొవిడ్ వ్యాక్సినేషన్లో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో డోసులు వేసిన ఘనత సాధించింది. కరోనా వైరస్ బారినపడుకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేచియంచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అందుకు తగిన చర్యలను కూడా చేపడుతున్నాయి.
ఈ క్రమంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్లో డోసుల సంఖ్య గురువారానికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ విజయాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటించనున్నారు.
అలాగే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా.. సింగర్ కైలాశ్ ఖేర్ ఆలపించిన పాటను, ఒక ఆడియో.. విజువల్ ఫిల్మ్ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం నాటికి మన దేశంలో 99.54 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన కొవిడ్ మార్గదర్శకాలను భారత్ తాజాగా సవరించింది. భారత్తో పరస్పర టీకా ఆమోద ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశాలకు ఈ విషయంలో పలు సడలింపులు కల్పించింది. ఈ సడలింపు ఇచ్చిన జాబితాలోని 11 దేశాలు ఉన్నాయి.
తర్వాతి కథనం
