Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 8 జులై 2022 (11:18 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 3.79 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 18815 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు ఏకంగా 4.96 శాతానికి పెరిగింది. 
 
అలాగే, కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ కనిపిస్తోంది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి కరోనా సోకిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతవ్యాప్తి కారణంగా క్రియాశీల కేసులు 1,22,335కి చేరాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.27 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.52 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 15,899 మంది కోలుకోగా.. 38 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments