1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (11:35 IST)

అడిలైడ్ టీ-20.. చెత్త రికార్డును నమోదు చేసుకున్న కసున్ రజిత

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో మూడు ట్వంటీ-20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఆస్ట్రేలియా-శ్రీలంకల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 75 పరుగులిచ్చి శ్రీలంక ఆటగాడు కసున్‌ రజిత చెత్త రికార్డును నమోదు చేశాడు.

ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో రజిత... తాను వేసిన మొదటి ఓవర్‌లో 11 పరుగులు, రెండో ఓవర్‌లో 21 పరుగులు, మూడో ఓవర్‌లో 25 పరుగులు, నాలుగో ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. టీ20ల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా నిలిచింది. 
 
అడిలైడ్‌లో జరిగిన ఈ టీ20లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. శ్రీలంకకు 234 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను శ్రీలంక బౌలర్లు కట్టడి చేయలేకపోయారు.

వార్నర్‌, కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌, మ్యాక్స్‌వెల్‌ అద్భుత ప్రదర్శనతో శ్రీలంక ముందు ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆసీస్ 134 పరుగులతో గెలుపును నమోదు చేసుకుంది.