శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (14:20 IST)

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పీవీ సింధు

pv sindhu
విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమ్మిట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 
 
ఈ సదస్సు ద్వారా ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడిదారులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడాకారిణులలో పీవీ సింధు ఒకరు. 
 
యువతకు రోల్ మోడల్‌గా పివి సింధు హాజరు కావడం ఈవెంట్ ఉత్సాహాన్ని పెంచింది. సాదర స్వాగతంతో సింధుకు ఆహ్వానం పలికారు.