1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Harsh Dubey replaces Washington Sundar for third ODI against England

ఇంగ్లండ్‌తో చివరి వన్డే మ్యాచ్ : టీమిండియాలో కీలక మార్పు

sunder - dubey
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమవ్వగా, అతని స్థానంలో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ హర్ష్ దూబేను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం ప్రకటించింది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్ సిరీస్ విజేత ఎవరో తేలిపోనుంది.
 
ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ కుడి తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అతను సిరీస్‌లోని మిగిలిన భాగానికి దూరమయ్యాడని బీసీసీఐ వెల్లడించింది. గాయం తీవ్రతను అంచనా వేయడానికి సుందర్‌కు స్కాన్లు నిర్వహించి, వైద్య నిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిపింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై కీలకమైన పోరుకు సుందర్ దూరం కావడం టీమిండియాకు ఒకింత ఎదురుదెబ్బేనని చెప్పాలి.
 
వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షి దూబే విదర్భకు చెందిన ఆటగాడు. గత నెలలో ఆఫ్ఘనిస్థాన్‌పై అరంగేట్రం చేసిన అతను, తన తొలి వన్డేలోనే 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఏ' సిరీస్‌లోనూ బంతితో, బ్యాట్ విశేషంగా రాణించాడు. ఈ వన్డే ముగిసిన అనంతరం, జులై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం హర్ష్ దూబే భారత జట్టుతోనే కొనసాగనున్నాడు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి