గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (17:04 IST)

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : భారత్ ఘన విజయం - సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఢీ

team india
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లోభాగంగా, ఆదివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 15, కేఎల్ రాహుల్ 51, కోహ్లీ 26, సూర్యకుమార్ 61, హార్దిక్ పాండ్యా 18, రిషబ్ పంత్ 3 చొప్పున పరుగులు చేశారు. ముఖ్యంగా, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. .115 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం జరుగుతుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్లు తలపడుతాయి. 
 
సూర్య ప్రతాపం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే? 
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులుచేసింది. ఫలితంగా జింబాబ్వే జట్టు ముంగిట 186 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌‍తో వీరవిహారం చేశాడు. 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మకు ఆరంభంలో ఆశించిన ఫలితం రాలేదు. కెప్టెన్‌గా మరోమారు నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులకే ఔట్ అయ్యాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం దూకుడుగా ఆడి 51 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే, హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ చెలరేగి ఆడాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది.