మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (14:00 IST)

విశాఖ టెస్టు: వరుసగా పెవిలియన్ క్యూ కట్టిన బ్యాట్స్‌మెన్లు.. 204 పరుగులకే భారత్ ఆలౌట్..

విశాఖ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లు వెంట వెంటనే నేలకూలాయి. ఫలితంగా 204 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో మొత్తం 404 పరుగుల లీడ్ సాధించింది. నాలుగో రోజు 98/3 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను క

విశాఖ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లు వెంట వెంటనే నేలకూలాయి. ఫలితంగా 204 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో మొత్తం 404 పరుగుల లీడ్ సాధించింది. నాలుగో రోజు 98/3 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించిన టీమిండియా మరో 106 పరుగులు జోడించింది. తొలి సెషన్ ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. 
 
ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే(26) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. ఆపై భారత బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ క్యూ కట్టారు. రహానేకు తర్వాత పది పరుగుల వ్యవధిలో రవి చంద్రన్ అశ్విన్(7)అవుటయ్యాడు. మరికొద్దిసేపటికే వృద్థిమాన్ సాహా(2) పెవిలియన్ చేరారు. 130/6 తో కష్టాల్లో టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు కెప్టెన్ కోహ్లీ(81). అయినా ఫలితం లేకుండా పోయింది. 
 
రషీద్ బౌలింగ్‌లో ఏడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా, యూటీ యాదవ్ వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో 204 పరుగులకే టీమిండియా అన్నీ వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్ చెరో నాలుగు వికెట్లు, అండర్సన్, అలీ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే పరిమితం అయ్యింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు సాధించింది.