1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:47 IST)

పాక్ జట్టు ప్రధాన కోచ్‌గా హెడెన్ - బౌలింగ్ కోచ్‌గా యూనిస్

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మ్యాథ్యూ హెడెన్‌ నియమితులయ్యారు. ఆ జట్టు హెడ్ కోచ్‌ అయిన మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్‌ అయిన వకార్ యూనిస్ తమ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో హెడెన్‌ను నియమించారు. 
 
అలాగే, పాక్ జట్టు బౌలింగ్ కోచ్‌గా వెర్నన్ ఫిలండర్‌ను నియమించారు. అయితే హెడెన్ రాకతో జట్టులో ఉత్సహం పెరుగుతుందని బోర్డు భావిస్తుంది. 
 
ఇక బాబర్ ఆజమ్ సారథ్యంలో పాక్ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 
 
అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో దాదాపు అన్ని క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక ఏ మధ్యే పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
 
పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మహ్మద్ హఫీజ్, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహీన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.