1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Team India Captain MS Dhoni steps down as India's limited-overs captain

ధోనీ షాకింగ్ నిర్ణయం... 200వ వన్డేకు మిస్, కెప్టెన్సీకి గుడ్ బై, కోహ్లికి పగ్గాలు...

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్‌పై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐకు తెలపడంతో బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. దీనితో క్రికెట్ క్రీడాభిమానులు షాక్ తిన్నారు. కొ

Team India Captain
జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్‌పై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐకు తెలపడంతో బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. దీనితో క్రికెట్ క్రీడాభిమానులు షాక్ తిన్నారు. కొత్త సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా ధోనీ 199 వన్డేలకు సారధ్య బాధ్యతలను వహించాడు. మరో 72 టి-ట్వంటీ మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 
 
ఐతే తను కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాను కానీ జట్టు నుంచి కాదని స్పష్టం చేశాడు. ధోనీ నిర్ణయంతో విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
అతడి హితం కోసం ధోనీ కెప్టెన్సీకి వీడ్కోలు... తెర వెనుక ఏం జరిగిందో...?