శనివారం, 18 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 అక్టోబరు 2025 (20:13 IST)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

Pakistan defence minister
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు సాగుతున్నాయి. పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆఫ్ఘన్ ఆరోపిస్తుండగా దానికి భారత్ మద్దతిస్తోంది. ఇలా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో దగ్గరవ్వడంతో పాకిస్తాన్ ఉలికిపాటుకు గురవుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా నోటికొచ్చిన చెవాకులు పేలారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
భారతదేశ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి ఉద్రిక్తతలు ఎదురైతే ఏం చేస్తారంటూ పాక్ యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఆ విషయాన్ని కొట్టి పారేయలేం. ఐతే ఈ రెండు దేశాలతో యుద్ధం చేయగల సత్తా మాకు వుంది. ఆ వ్యూహాలు మాకు వున్నాయి. ఐతే వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడను. పాకిస్తాన్ దేశం పైన దాడులు జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారతదేశంలో వున్నారు. భారతదేశం ఆదేశాల మేరకే ఆఫ్ఘన్ తమపై దాడులు చేస్తోందంటూ విచిత్ర వాదన చేస్తోంది.