1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (13:25 IST)

విరాట్ కోహ్లీ ఆవేదన.. వీడియో వైరల్

Kohli
Kohli
2023వ సంవత్సరం టీమిండియాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. 2023లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కూడా టీమిండియా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. టోర్నీ ఆద్యంతం నిలకడగా ఆడిన భారత్ ఓడిపోకుండా ఫైనల్ చేరింది. లీగ్ దశలో 9 మ్యాచ్‌ల అనంతరం సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. 
 
కానీ ఫైనల్‌లో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఒక దశలో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత శిబిరం విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లబుషానే (58) భారత్ ఆశలను వమ్ము చేశారు. 
 
నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి భారత్‌ను ట్రోఫీకి దూరం చేసింది. 43వ ఓవర్ చివరి బంతికి 2 పరుగులు... ఆస్ట్రేలియాకు మ్యాక్స్‌వెల్ ట్రోఫీని అందించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు సహా 140 కోట్ల మంది భారతీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
 
అయితే తాజాగా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. మ్యాక్స్‌వెల్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టేడియంలోకి పరుగులు తీశారు. దీంతో గ్రౌండ్ లోని కెమెరాలన్నీ ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలను రికార్డు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. 
 
అయితే మైదానంలో మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ఓ అభిమాని విరాట్ కోహ్లీని ఎమోషనల్ వీడియో రికార్డ్ చేశాడు.
మ్యాక్స్‌వెల్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి వేదనతో ఆవేదనను వ్యక్తం చేశాడు. 
 
అయోమయంలో వికెట్ల వద్దకు వచ్చి తన క్యాప్‌తో బెయిల్స్‌ను పడగొట్టాడు. కాసేపు అలాగే ఉండిపోయాడు. రోహిత్ శర్మ కూడా నొప్పితో విరాట్ వైపు వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.