మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (10:25 IST)

సోషల్ మీడియాలో మహిళ పరిచయం.. ఆస్పత్రికి పిలిచి మరో ఇద్దరితో కలిసి వైద్యుడు రేప్

victim
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆస్పత్రిలోనే అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీలో ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆస్పత్రిలో పని చేసే ఓ వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలో పని చేసే మహిళా ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. అలా ఏర్పడిన పరిచయం కాస్త చనువుగా మారింది. ఈ క్రమంలో ఓ సారి తన ఆస్పత్రికి రావాలంటూ ఆమెను వైద్యుడు కోరాడు. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. 
 
అక్కడ నుంచి ఆమెను ఓ హాస్టల్ గదికి తీసుకెళ్లిన ఆ వైద్యుడు.. మరో ఇద్దరు సహచర వైద్యులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 27వ తేదీన ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.