1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి... భార్యాపిల్లలను చంపేసి మచిలీపట్నం టెక్కీ ఆత్మహత్య.. ఎక్కడ?

suicide
సంపాదించిన సొమ్మంతా షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన భార్యాపిల్లను హత్య చేసిన ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని మచిలీపట్నంకు చెందిన టెక్కీగా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మచిలీపట్నానికి చెందిన విజయ్ (31) అనే వ్యక్తి టెక్కీగా పనిచేస్తున్నారు. ఈయన తన భార్య హైమావతి (29), ఇద్దరు కుమార్తెలతో కలిసి సిగేహళ్లిలోని ఓ అపార్టుమెంటులో నివసించేవారు. జూలై 31వ తేదీన వారందరూ విగతజీవులుగా మారడం స్థానికంగా కలకలం కృష్టించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
 
విజయ్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన డబ్బంతా పోగొట్టుకోవడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అతను తన భార్య, యేడాదిన్నర, ఆరు నెలల వయసున్న ఇద్దరు కూతుళ్లు హత్య చేసి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని బెంగుళూరు డీసీపీ వెల్లడించారు. కుటుంబ సభ్యులను గొంతు నులిమి హత్య చేసినట్టు ఫోరెన్సిక్ నిపుణులు అంచనాలను వచ్చారని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో శనివారం మచిలీపట్నంలో వారి అత్యంక్రియలు జరిగాయి.