1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (10:41 IST)

రాజేంద్ర నగర్ పీఎస్‌ పరిధిలో మహిళపై సామూహిత అత్యాచారం

హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆటోలో ఎక్కిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై రాజేంద్ర నగర్ సీఐ కనకఈయ్య వెల్లడించిన వివరాల మేరకు.. సిటీలోని పురానాపూల్​కు చెందిన మహిళ(30) బుధవారం హైదర్ గూడకు పని మీద వచ్చింది. తిరిగి పురానాపూల్ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. మహిళ ఒంటరిగా ఉండగా, ఆటోలోని వ్యక్తులు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా పోనిచ్చారు.
 
లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు గురువారం రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఫైల్​ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్​ చేస్తున్నారు.