1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (21:11 IST)

యువకుడితో వివాహిత అక్రమ సంబంధం... బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం

ఓ మహిళ తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కలిసి వీడియో తీశాడు. దీన్ని చూపిస్తూ ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. ఇలా పదేపదే బెదిరింపులకు పాల్పడుతుండటాన్ని ఆ మహిళ తట్టుకోలేక పోయింది. ఈ విషయాన్ని తన ప్రియుడుకి చెప్పి బోరున విలపించింది. చివరకు ఆ మహిళ, ఆమె ప్రియుడు ఆత్మహత్యకుయత్నించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బోరుబండ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోరుబండకు చెందిన ఓ మహిళ వెంకట్ అనే కుర్రోడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని అదే ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్, యాసిన్ అనే ఇద్దరు వ్యక్తులు గుర్తించారు. ఓ రోజున వెంకట్‌తో ఆ మహిళ సన్నిహితంగా ఉండటాన్ని చూసిన ఇస్మాయిల్, యాసిన్‌లు వీడియో తీశారు. అప్పటి నుంచి ఆ మహిళను బెదిరించసాగారు. తమ కోరిక తీర్చకుంటే వీడియోను బయటపెడతానని బెదిరించసాగారు. అలా ఆ మహిళను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేశారు. 
 
అయినప్పటికీ వారిద్దరి కామదాహం తీరలేదు. దీంతో అతని బ్లాక్‌మెయిలింగ్ రోజురోజుకూ ఎక్కువైపోయింది. పదేపదే విసిగిస్తుండటంతో ఆ బాధితురాలి విసిగిపోయింది. తన ప్రియుడు వెంకట్‌తో కలిసి వికారాబాద్‌కు వెళ్లి అక్కడ పురుగుల మందు సేవించింది. వారిద్దరూ అపస్మారక స్థితిలో పడివుండటాన్ని చూసిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించి, వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆ జంట కోలుకున్న తర్వాత పోలీసులు ప్రశ్నించగా, అసలు విషయం చెప్పింది. దీంతో ఇస్మాయిల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.