గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:58 IST)

మహిళపై అత్యాచారం చేసి... హత్య చేశారు... ఎక్కడ?

crime news
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యాచారం చేసిన కొందరు దుండగులు... ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో వెలుగు చూసింది. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
 
ఈ నెల 25వ తేదీన పాత సామగ్రి సేకరిస్తూ వెళ్లిన మహిళ నిర్మాణంలో ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెపై దుండగులు లైంగిక దాడి చేసి అనంతరం బండరాయితో మోది అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసు ఆధారంగా విచారణ ప్రారంభించారు. తప్పిపోయిన మహిళే హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.