గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (14:35 IST)

రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం డ్రమ్ములో మహిళ మృతదేహం

plastic drum
కర్నాటక రాష్ట్రంలోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్ములో కుక్కివుంది. రైల్వే స్టేషన్ పారిశుద్ధ్య కార్మికులు ఫ్లాట్ ఫాంను శుభ్రం చేస్తుండగా దీనిని గుర్తించారు. ఈ మృతదేహం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఒకటో నంబరు ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్మును శుభ్రం చేసేందుకు ప్రయత్నించగా, దుర్వాసన వచ్చింది. దీంతో డ్రమ్ము మూత తీసి చూడగా అందులో మహిళ మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇంచారు. 
 
పాల్తీన్ కవర్‌లో శవాన్ని చుట్టి డ్రమ్ములో కుక్కి, ఆ తర్వాత డ్రమ్ముకు మూత గట్టిగా బిగించారు. దీంతో దుర్వాస రాలేదు. డ్రమ్ము మూత తీయగానే ఒక్కసారిగా దుర్వాసన వెదజల్లడంతో అక్కడకు వెళ్లి చూడగా మహిళ శవంగా గుర్తించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 యేళ్ల మధ్య ఉంటాయని భావిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.