దీపావళి అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి?

Written By సిహెచ్
Updated: శనివారం, 26 అక్టోబరు 2019 (22:34 IST)
దీపావళి అక్టోబరు 28. ఈ పండుగ రోజున వేకువ జామున అభ్యంగన స్నానం చేయాలి. ఒంటినిండా శుభ్రంగా నూనెను పట్టించి, దానిని శెనగపిండితో రుద్దుకుని.. పావు గంట అలానే వుండి.. తలంటు స్నానం చేయాలి. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. అందుకే శరీరభాగాలు మొద్దుబారిపోకుండా వుండేందుకు.. నూనెను పట్టించి.. అభ్యంగన స్నానం చేస్తారు. 
 
దీపావళి అభ్యంగనం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా దీపావళి రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెప్తున్నారు. నువ్వులనూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శెనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. అందుకే దీపావళి రోజున నూనెతో శరీరానికి మర్దన చేసి అభ్యంగన స్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే నరకచతుర్దశి నాటి నుంచే, ఇళ్లల్లో, ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 

అన్నీ చూడండి

ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ

విద్యార్థులపై పల్లెట్ గన్‌లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్

అన్నీ చూడండి

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌

తర్వాతి కథనం
Show comments