1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (23:29 IST)

87% భారతీయ వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పనికి ఓకే

మహమ్మారి సమయంలో రిమోట్ వర్క్, వీడియో సమాచార ప్రసార పరిష్కారాల యొక్క ఆర్ధిక ప్రభావాన్ని అంచనా వేయడానికి, గణనీయమైన ఆర్థిక సంక్షోభం సమయంలో వ్యాపార కొనసాగింపు మరియు వృద్ధి కూడా అందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ ఉపయోగించి పరిశ్రమలు తమ వ్యాపార ప్రక్రియలను ఏ దిశగా మార్చగలిగాయి అనే అంశంపై దృష్టి సారించే విధంగా, ఒక సర్వే మరియు ఆర్థిక విశ్లేషణలను నిర్వహించడానికి జూమ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బిసిజి)ను నియమించింది. సదరు బిసిజి చేసిన సర్వే డేటా మరియు ఫలితాల ఆధారంగా జూమ్ తయారుచేసిన ఫలితాల నివేదిక, భారతదేశం, యు.ఎస్., యు.కె., జపాన్, ఫ్రాన్స్ మరియు జర్మనీతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు దేశాలు మరియు కీలక పరిశ్రమలను కలిగి ఉంది.
 
నివేదిక నుండి కొన్ని కీలకమైన వాస్తవాలు: 
సర్వే చేయబడిన వ్యాపార సంస్థల్లో రిమోట్‌గా పనిచేసే ఉద్యోగులలో 2.5-3.0x పెరుగుదల, దీనికి వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలను ఉపయోగించే ఉద్యోగుల 2.4-2.7x పెరుగుదల యొక్క సహకారం ఉంది. 
 
సర్వే చేయబడిన వ్యాపార సంస్థల్లోవీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాల కోసం గడిపిన మొత్తం సమయం 3-5x పెరిగింది
 
2020సంవత్సరానికిBCG యొక్క COVID-19 ఉద్యోగుల సెంటిమెంట్ సర్వేలో, సర్వే చేసిన మేనేజర్లలో 70% మంది మహమ్మారికి ముందు కంటే దాని తరువాత సరళమైన రిమోట్ వర్కింగ్ నమూనాలకు ఎక్కువ అనుకూలంగా ఉన్నారని తేలింది.
 
హైబ్రిడ్ వర్కింగ్ నామూనాలు కొనసాగుతాయి - సర్వే చేయబడిన వ్యాపార సంస్థలు మహమ్మారి తరువాత మూడవ వంతుకు పైగా ఉద్యోగులు రిమోటుగా పనిచేయాలని ఆశిస్తున్నాయి.
 
పని భవిష్యత్తు
COVID-19మహమ్మారి రిమోట్ పనిని తప్పనిసరి చేసింది. అయితే ఈ ధోరణి ఇలానే కొనసాగబోతోంది. కొంతమంది ఉద్యోగులు మహమ్మారి తరువాత తిరిగి కార్యాలయాలకు వెళతారు, కానీ మిగిలినవారిలో ఎక్కువ శాతం అప్పుడు కూడా రిమోట్ లేదా హైబ్రిడ్ ఉద్యోగులుగా సహకారం అందిస్తారు. వాస్తవానికి, సర్వే చేసిన దాదాపు అన్ని దేశాలలో రిమోట్ పని ప్రబలంగా కొనసాగుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 
 
దేశం ద్వారా ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు లాక్‌డౌన్లతో పోరాడుతుండగా, ప్రజలు చాలా వేగంగా రిమోట్ వర్క్ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలను స్వీకరించారు. రిమోట్ పనిని వేగంగా మరియు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా, ఈ దేశాలలోని వ్యాపార సంస్థలు మహమ్మారి ఫలితంగా పోగొట్టుకునే డబ్బు మరియు ఉద్యోగాలు రెండింటినీ రక్షించుకోగలిగాయి. ఉదాహరణకు, యు.ఎస్‍లో, రిమోట్‌గా పని చేసే సామర్థ్యం కారణంగా 2.28 మిలియన్ ఉద్యోగాలను రక్షించుకోవడానికి సాయపడింది. 
 
ప్రస్తుతం మరియు భవిష్యత్తులో వీడియో సమాచార ప్రసార పరిష్కారాలు ప్రజలు పనిచేసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడటానికి, నివేదిక యొక్క సర్వే అంశం 2019, 2020లో తమ కంపెనీలోని ఎంత శాతం ఉద్యోగుల వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలను ఉపయోగించారు మరియు 2022 వరకు ఉపయోగిస్తారని ఆశించబడుతుందని అంచనా వేయమని ప్రతిస్పందకులను అడిగింది. ఎంటర్ప్రైజ్ మరియు చిన్న-మధ్య తరహా వ్యాపారాలు (ఎస్ఎంబి) వారీగా ఫలితాలు వర్గీకరించబడ్డాయి. మనకు కనిపిస్తున్న విధంగా, 2019తో పోల్చితే మహమ్మారి తరువాత వీడియో కాన్ఫరెన్సింగ్ వాడకం గణనీయంగా పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.
 
పరిశ్రమ ద్వారా ప్రభావం
మహమ్మారి యొక్క ఆర్ధిక ప్రభావం నుండి ఏ ఒక్క పరిశ్రమ కూడా నిరోధించబడలేదు, కాని సర్దుబాటు చేసుకోవడానికి కొందరు ప్రవర్తనలో నాటకీయ మార్పులు చేసుకున్నారు. ఈ సర్వే కొరకు, మహమ్మారి సమయంలో కార్యకలాపాలు కొనసాగించడానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, సాంకేతికత మరియు వృత్తిపరమైన సేవల రంగాలు రిమోట్ సహకారాన్ని ఎలా స్వీకరించాయి మరియు భవిష్యత్తులో పోకడలు ఎలా కొనసాగవచ్చు అనే విషయాలను పరిశీలించింది.

 
ఇక్కడ కొన్ని అంతర్దృష్టులు ఇవ్వబడ్డాయి:
ఆరోగ్య సంరక్షణ: "వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాల ద్వారా విజయవంతమైన రిమోట్ సహకారం అందిన కారణంగా నా కంపెనీ సౌకర్యవంతమైన రిమోట్ వర్కింగ్ నమూనాను పరిశీలిస్తోంది" అని సర్వే చేయబడిన 67% వ్యాపార సంస్థలు అంగీకరించాయి.
 
విద్య: సర్వే చేయబడిన వ్యాపార సంస్థల్లో మహమ్మారి సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాల వాడకంలో 3.5x పెరుగుదల 
 
టెక్నాలజీ: "మహమ్మారి తరువాత వ్యాపార కార్యకలాపాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలు కీలకంగా ఉండడం కొనసాగుతుందని" సర్వే చేయబడిన 84% వ్యాపారాలు అంగీకరిస్తున్నాయి.
 
వృత్తిపరమైన సేవలు: సర్వే చేయబడిన వ్యాపార సంస్థల్లో మహమ్మారి సమయంలో రిమోట్ పనిలో 2.7x పెరుగుదల.