పరగడుపున నేరేడు పండ్లు తినరాదు, ఎందుకంటే?

శనివారం, 1 ఆగస్టు 2020 (22:25 IST)
నల్లటి ద్రాక్షకాయల్లా వుండే నేరేడు కాయలు ఈ వర్షాకాలంలో స్పెషల్. ఈ నేరేడు కాయలు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అవేమిటో చూద్దాం.
 
1. నేరేడు చిగుళ్లు, మామిడి చిగుళ్లు తీసుకుని వాటితో కషాయం కాచి, దానిలో తేనె చేర్చి సేవిస్తే, పైత్యపు వాంతులు వెంటనే తగ్గిపోతాయి. 
 
2. కిడ్నీలో రాళ్లు వున్నవారు నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాదు మరోసారి రాళ్లు ఏర్పడే అవకాశమే వుండదు.
 
3. ముఖ్యమైన గమనిక ఏమిటంటే... నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణాశయంలో సమస్య ఏర్పడి అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల ముందుగా ఏదో ఒకటి తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి. అలాగే ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత వాటిని తినవచ్చు.
 
4. నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకుని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుంది.
 
5. నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి. అలాగే నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.

అన్నీ చూడండి

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

ముద్దుల్లో ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రెజిల్ ప్రేమజంట

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments