1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2016 (11:23 IST)

బాలింతలు కర్బూజ తింటే మేలెంత..? కాకర రసంతో బహిష్టు నొప్పులకు చెక్

పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ మన దరికి చేరవని వైద్యులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదవ వంతు పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ మన దరికి చేరవని వైద్యులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదవ వంతు పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ మోతాదులో పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రాకుండా కాపాడవచ్చని నిపుణులు అంటున్నారు. వీటిని నిత్యం తినడం వల్ల మనిషి జీవితకాలం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. రోజూ డైట్‌లో ఏడవ వంతు పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడంతోపాటు తొందరగా మృత్యువాత పడరని చెప్తున్నారు.
 
స్థూలకాయం, షుగర్ వ్యాధులతో బాధపడే వారికి బత్తాయి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాసు బత్తాయి రసం తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో ఉండే ఒక రకమైన ఆమ్లాలకు క్యాన్సర్‌ను అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ద్రాక్షను తీసుకుంటే కాన్సర్ వ్యాధి కారకుండా కాపాడుతుంది.
 
కర్బూజ పండు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. బాలింతలు కర్బూజ ఎక్కువగా తినడం వల్ల పసి పిల్లలకు పాలు పుష్కలంగా లభిస్తాయి. యాపిల్ పండు రోజూ తినడం వల్ల అల్సర్, విరేచనాలు రాకుండా కాపాడుతుంది. దీనిలో సి-విటమిన్, సెల్యులైజ్, చక్కెర పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పండు చర్మానికి తేమను అందించి నిగారింపును కూడా ఇస్తుంది.
 
కాకరకాయ రసంలో చెంచా తేనె కలిపి నాలుగు నెలలు తాగితే బహిష్టు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆయాసం, పొట్టలోని కురుపులు తగ్గుముఖం పడుతుంది. కాకర రసంలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే రక్తగడ్డలు, తామర, గజ్జి, దురద నయమవుతాయి.