బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (13:51 IST)

గర్భధారణ సమయంలో కోవిడ్ 19 ఎలాంటి ప్రభావం చూపుతుంది?

pregnency
గర్భందాల్చిన లేదా గర్భందాల్చే మహిళలు కోవిడ్-19 బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇందుకోసం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లతో తమను తాము రక్షించుకోవాలని యుఎస్‌లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.
 
కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ అయిన SARS-CoV-2 సోకిన గర్భిణీ స్త్రీలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరే ప్రమాదం రెట్టింపుగా ఉందని ఈ వర్శిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. 
 
క్లినికల్ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. కోవిడ్ ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా అంటు వ్యాధి లేని వారి కంటే ఆసుపత్రిలో చనిపోయే ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువ అని తేలింది. గర్భందాల్చిన లేదా గర్భందాల్చే మహిళలు కోవిడ్-19 బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 
 
తల్లికి బాగోలేకపోతే బిడ్డ అనారోగ్యంగానే ఉంటుందని, అందువల్ల గర్భిణులు తమ పుట్టబోయే బిడ్డలను, నవజాత శిశువులను రక్షించుకోవడానికి ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించింది.  
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తే, గర్భధారణలో ఉపయోగించేందుకు సూచించిన కోవిడ్-19 వ్యాక్సిన్‌లు సురక్షితమైనవని వారు చెబుతున్నారు. అవి నవజాత శిశువులకు, వారి తల్లులకు రక్షణ కల్పిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
ఈ అధ్యయనాన్ని ఆరు ఆఫ్రికన్ దేశాలైన ఘనా, నైజీరియా, కాంగో, ఉగాండా, కెన్యా మరియు దక్షిణాఫ్రికా డెమొక్రాటిక్ రిపబ్లిక్‌లో ఆసుపత్రిలో చేరిన 1,315 మంది మహిళల డేటాను పరిశీలించింది. కోవిడ్‌తో బాధపడుతున్న 510 మంది గర్భిణీ స్త్రీలు, 403 మంది గర్భిణీ స్త్రీలు, సాధారణ మహిళలపై అధ్యయనం చేసింది. 
 
మధుమేహం, హెచ్‌ఐవి, క్షయవ్యాధి చరిత్ర లేదా సికిల్ సెల్ వ్యాధి వంటి ఇతర ప్రమాద కారకాలు ఉన్న మహిళలు తీవ్రమైన కోవిడ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ సోకని గర్భిణీ స్త్రీలలో 16 శాతంతో పోలిస్తే కోవిడ్ ఉన్న గర్భిణీ స్త్రీలలో 32 శాతం మందికి ఆసుపత్రిలో ఆక్సిజన్ థెరపీ అవసరమవుతుంది.
 
కోవిడ్ లేని గర్భిణీ స్త్రీలలో 6 శాతం మందితో పోలిస్తే, కోవిడ్ ఉన్న గర్భిణీ స్త్రీలలో 19 శాతం మంది ఐసియులో చేరారు. కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన మహిళల్లో, గర్భిణీలుగా ఉన్నవారిలో 10 శాతం మంది మరణించారు, గర్భవతి కాని 5 శాతం మంది మరణించారు.