1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Surprising Benefits of an Afternoon Nap

మధ్యాహ్నం పూట కునుకు మంచిదే.. జ్ఞాపకశక్తి పెరిగిందట..!

Afternoon Nap
మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత హాయిగా అలా అరగంట పాటు కునుకు తీయాలనుకుంటున్నారా? అయితే బరువు పెరిగిపోతామని భయపడుతున్నారా? అలాంటి వారు మీరైతే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కునుకు తీయడం చాలా ఆరోగ్యకరమని సెలవిస్తున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని ఇటీవలి ఓ అధ్యయనంలో పేర్కొన్నారు. 
 
మధ్యాహ్నం సమయంలో క్రమం తప్పకుండా నిద్రపోవటం వల్ల మానసిక చురుకుదనంతో ముడిపడి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఆన్‌లైన్ జర్నల్ జనరల్ సైకియాట్రీలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మధ్యాహ్నం వేళ నాపింగ్ అనేది మంచి స్థాన అవగాహన, శబ్ధాన్ని గుర్తించే పటిమ, పని జ్ఞాపకశక్తితో ముడిపడి ఉంటుంది. సుదీర్ఘ ఆయుర్దాయంతో పాటు వచ్చే న్యూరోడిజెనరేటివ్ మార్పులు, చిత్తవైకల్యం అవకాశాన్ని పెంచుతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో 65 ఏళ్ల వయసు పైబడిన 10 మందిలో ఒకరు ఇలా చిత్తవైకల్యంతో ఉన్నట్లు గుర్తించారు.
 
మధ్యాహ్నం న్యాప్‌లను భోజనం తర్వాత 5 నిమిషాల నిద్రావస్థ కాలంగా నిర్వచించారు. ఇది 2 గంటలకు మించకుండా చూశారు. పరిశోధనలో పాల్గొన్నవారు వారంలో ఎన్నిరోజులు మధ్యాహ్నం కునుకు తీశారని, అది వారం నుంచి నిత్యంకు దారితీసిందా? అనే దానిపై ప్రశ్నించారు. చివరగా మధ్యాహ్నం కునుకు 5 నిమిషాల పాటు కొనసాగించిన వారు పనికి సంబంధించిన జ్ఞాపకశక్తిని పెంపొందించుకున్నారని, వీరిలో మానసిక చురుకుదనం కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు.
తర్వాతి కథనం
జామకాయలు తింటే పొట్ట తగ్గుతుందా?