పండ్లు తింటున్నారా? పద్ధతి అవసరం.. అల్పాహారంగా పండ్లు తీసుకుంటున్నారా?
పండ్లు తినడంలోనూ పద్ధతి ఉండాలి. ఎప్పుడుపడితే అప్పుడు పండ్లు తీసుకోకూడదు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్గా పండ్లను తీసుకుంటే.. ఒక గ్లాసు నీరు సేవించిన తర్వాత పండ్లను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నా
పండ్లు తినడంలోనూ పద్ధతి ఉండాలి. ఎప్పుడుపడితే అప్పుడు పండ్లు తీసుకోకూడదు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్గా పండ్లను తీసుకుంటే.. ఒక గ్లాసు నీరు సేవించిన తర్వాత పండ్లను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే భోజనానికి తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది కాదు.
భోజనం తీసుకున్నాక పండ్లను తీసుకుంటే అవి సరిగ్గా జీర్ణం కావు. ఇంకా వాటిలోని పోషకాలను జీర్ణవ్యవస్థచే పీల్చబడవు. అందుకే భోజనానికి 30 నిమిషాల ముందు పండ్లను తీసుకోవడం అలవాటు తీసుకోవాలి.
భోజనానికి తర్వాత తీసుకోవాల్సి వస్తే రెండు గంటల గ్యాప్ తర్వాత పండ్లు తీసుకోవాలి. పండ్లను ఉడికించిన ఆహారాలతో కలిపి తీసుకోకూడదు. అసిడిటీ లేనివారు పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.
ఆపిల్ పండును వారంలోపు తినాలి. అరటి పండును మూడు రోజుల్లోపే తినాలి. బొప్పాయి, సపోటాలను పండిన రెండు రోజుల్లోపే తినడం మంచిది. ఫ్రిజ్ల్లో ఉంచి ఎక్కువ రోజుల తర్వాత తీసుకుంటే వాటిలోని పోషకాలు శరీరానికి ఏమాత్రం అందవు.