బంగ్లాదేశ్లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు
బంగ్లాదేశ్లో విమాన ప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. వీరిలో 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఓ పైలెట్ ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన సంఖ్య తెలియాల్సివుంది.
కూలిపోయిన విమానం ఎఫ్-7 బీజీఐ రకానికి చెందిన ఇది చైనా జె-7 యుద్ధ విమానానికి అధునాతన వెర్షన్. బంగ్లాదేశ్ వాయుసేన వద్ద ఉన్న 16 విమానాల్లో ఒకటి. స్థానిక నివేదికల ప్రకారం ఎఫ్ 7 బీజీఐ విమానం సాధారణ శిక్షణ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
టీవీ ఫుటేజీ, ఆన్లైన్లో షేర్ చేయబడిన వీడియోలలో ప్రమాదం స్థలం వద్ద మంటలు, పొగ దట్టంగా వెలువడుతూ కనిపించాయి. అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఓ వీడియోలో శిథిలాల కింద కూరుకునిపోయిన విమాన ఇంజిన్ దృశ్యం భీతావహంగా మారిపోయింది.