అల్పాహారంలో పెరుగుతో ఫ్రూట్స్ స్మూతీ వుంటే..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:08 IST)
అల్పాహారంలో పెరుగుతో కూడిన పండ్ల స్మూతీని భాగం చేసుకుంటే అతి సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక రెండు గంటలకు ఒక కప్పు బొప్పాయి లేదా తర్బూజ ముక్కలు, ఆపిల్‌ లేదా స్ట్రాబెర్రీలు వేసి తయారు చేసిన పెరుగు స్మూతీ తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. 
 
మధ్యాహ్నం ఒక కప్పు బ్రౌన్‌ రైస్‌, ఒక టీస్పూన్‌ నెయ్యి, కూరగాయాలు లేదా గ్రిల్డ్‌ చికెన్‌ లేదా ఫిష్‌ తీసుకోవాలి. అలాగే స్నాక్స్‌ సమయంలో 8 నుంచి పది వేయించిన మఖానాలు లేదా ఐదు వాల్‌నట్స్‌ లేదా ఐదు కిస్మిస్‌లు, లేదా రెండు కోడిగుడ్లు తీసుకోవాలి. డిన్నర్‌లో వెజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. చికెన్‌ సూప్‌, మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. అలాగే పప్పు లేదా పన్నీర్‌, గ్రిల్డ్‌ చికెన్‌, ఫిష్‌ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్‌ అయితే బీన్స్‌, బ్రొకోలి, పుట్ట గొడుగులు తినాలి.
 
అలాగే ఉదయాన్నే పరగడుపునే అరగ్లాసు అలోవెరా జ్యూస్‌లో పది తులసి ఆకులు, కొద్దిగా బెల్లం, అల్లం రసం కలుపుకుని తాగాలి. ఆ తరువాత రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఈ వేసవిలో దుబాయ్‌లో పిల్లలకు వినోదాన్ని అందించండి

రీల్స్ తీసే కెమెరామెన్‌‍ను పెళ్లాడిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు... ఎవరా అదృష్టవంతుడు?

తోటి ఉద్యోగులు పట్టించుకోలేదు.. ఆ స్ట్రీట్ డాగ్ విశ్వాసం చూపింది (వీడియో)

ప్రధాని మోడీ ట్వీట్‌తో ఒరిగేదేమీలేదు : ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే : సీజేపీ

విద్యార్థుల ఆందోళనపై బాలీవుడ్ నటుల మౌనం : శశిథరూర్ విమర్శలు

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments