అల్పాహారంలో పెరుగుతో ఫ్రూట్స్ స్మూతీ వుంటే..?

శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:05 IST)
అల్పాహారంలో పెరుగుతో కూడిన పండ్ల స్మూతీని భాగం చేసుకుంటే అతి సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక రెండు గంటలకు ఒక కప్పు బొప్పాయి లేదా తర్బూజ ముక్కలు, ఆపిల్‌ లేదా స్ట్రాబెర్రీలు వేసి తయారు చేసిన పెరుగు స్మూతీ తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. 
 
మధ్యాహ్నం ఒక కప్పు బ్రౌన్‌ రైస్‌, ఒక టీస్పూన్‌ నెయ్యి, కూరగాయాలు లేదా గ్రిల్డ్‌ చికెన్‌ లేదా ఫిష్‌ తీసుకోవాలి. అలాగే స్నాక్స్‌ సమయంలో 8 నుంచి పది వేయించిన మఖానాలు లేదా ఐదు వాల్‌నట్స్‌ లేదా ఐదు కిస్మిస్‌లు, లేదా రెండు కోడిగుడ్లు తీసుకోవాలి. డిన్నర్‌లో వెజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. చికెన్‌ సూప్‌, మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. అలాగే పప్పు లేదా పన్నీర్‌, గ్రిల్డ్‌ చికెన్‌, ఫిష్‌ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్‌ అయితే బీన్స్‌, బ్రొకోలి, పుట్ట గొడుగులు తినాలి.
 
అలాగే ఉదయాన్నే పరగడుపునే అరగ్లాసు అలోవెరా జ్యూస్‌లో పది తులసి ఆకులు, కొద్దిగా బెల్లం, అల్లం రసం కలుపుకుని తాగాలి. ఆ తరువాత రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ప్రాపర్టీ డీలర్‌ను పట్టపగలే రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, వీడియో

Tirupati: ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి తిరుపతిలో అలెర్ట్

రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

అన్నీ చూడండి

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments