గురువారం, 29 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: గురువారం, 19 మార్చి 2015 (08:27 IST)

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,169 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4 నిండాయి. వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా పెరగనున్నది. ఈ పరిస్థితి శుక్రవారం కూడా ఇంకాస్త పెరుగుతుంది. ఉగాది సెలవులు రానుండడంతో పెరిగే అవకాశం ఉంది.