Last Modified: గురువారం, 25 డిశెంబరు 2014 (07:17 IST)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
క్రిస్మస్ సెలవులు రావడం, యేడాది ఆఖరు కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 28 కంపార్టుమెంట్లు నిండాయి.