గురువారం, 5 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Modified: గురువారం, 25 డిశెంబరు 2014 (07:17 IST)

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

క్రిస్మస్ సెలవులు రావడం, యేడాది ఆఖరు కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 28 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 16
రూ. 50 గదులు ఖాళీ లేవు
రూ. 100 గదులు 12
రూ. 500 ఖాళీ లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 112
సహస్రదీపాలంకరణ సేవ  145
వసంతోత్సవం 24