శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మార్చి 2023 (16:55 IST)

కాల్వలో బోల్తాపడిన బస్సు - 17 మంది మృత్యువాత

bangla bus accident
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో బస్సు ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 
 
బంగ్లాదేశ్‌లోని సోనాదంగా నుంచి ఆ దేశ రాజధాని ఢాకాకు 40 మంది ప్రయాణికులతో కలిసి ఆదివారం ఉదయం ఒక బస్సు బయలుదేరింది. ఇది మమదరిపూర్ అనే ఏరియాలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిని గుర్తించాల్సివుంది.
 
మరోవైపు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతివేగం, బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు  భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పాత రోడ్లతోపాటు వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.