సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (10:52 IST)

ఇరాక్‌లో అమెరికా బాంబుల వర్షం... 250 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం

ఇరాక్‌లో అమెరికా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో అమెరికా సాయుధ దళాలు ఇరాక్‌లోని ఫలూజాలో యుద్ధవిమానాలతో బాంబుల వర్షం కురిపించాయి. 
 
ఈ  దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఫలూజా నుంచి వాహనాల్లో వెళుతుండగా ఉగ్రవాదులపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 40 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉగ్రవాదులకు ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.  
 
మరోవైపు... ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన ఆత్మాహుతి దాడికి పాల్పుడిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.