బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (16:33 IST)

ఇండోనేషియాలో భారీ భూకంపం... 46 మంది మృతి

earthquake
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. దీనికిధాటికి 46 మంది మృత్యువాతపడ్డారు. అలాగే మరో 300 మంది వరకు గాయపడ్డారు. ఈ భూకంప కేంద్రాన్ని జావా పశ్చిమ ప్రాంత పట్టణం సియాంజర్‌కు సమీపంలో గుర్తించారు. 
 
ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా సియాంజుర్‌ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద చిక్కుకునిపోయిన వారిని సహాయక బృందాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భూకంపం ప్రభావం కారణంగా ఇండోనేషియా రాజధాని జగర్తాలో సముద్ర అలలు ఎగిసెగిసి పడుతున్నాయి.