1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Coronavirus cases in pakistan cross 192000 mark

పాకిస్థాన్‌‌లో కరోనా.. ఒకే రోజు 148మంది మృతి.. 192000 మార్క్ దాటిన కేసులు

Coronavirus
పాకిస్థాన్‌‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,044 మందికి కరోనా సోకినట్లైంది. తద్వారా పాకిస్థాన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1,92,970కి పెరిగింది.

ఇంకా గడిచిన 24 గంటల్లో 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా 3,903గా మృతుల సంఖ్య నమోదైంది. అలాగే కరోనా సోకి చికిత్స పొందుతూ ఇప్పటివరకు 81,307 మంది డిశ్చార్జ్ అ్యయారు. 
 
మొత్తంగా సింధులో 74,070, పంజాబ్ 71,191, కైబర్ -23,887, ఇస్లామాబాద్ -11,710, బలూచిస్థాన్‌లో 9,817, గిల్గిత్‌లో 1,365, అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 930మందికి కరోనా సోకింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పెళ్లైన మరుసటి రోజే కోవిడ్‌తో వరుడి మృతి.. పెళ్లికి హాజరైన 31మందికి కరోనా