శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (10:20 IST)

ధృవ్ పటేల్‌కు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటం

dhruv patel
తాజాగా న్యూజెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. ఇందులో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధ్రువీ పటేల్ దక్కించుకున్నారు. ఈమె అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి. ఈ పోటీల్లో విజేతగా అవతరించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే తాను బాలీవుడ్ నటి అవ్వాలని, ఇంకా యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని ఆకాంక్షించారు. 
 
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో కిరీటం బహుకరణ తర్వాత ధ్రువీ మాట్లాడుతూ... 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్‌ని అందుకోవడాన్ని అపురూప గౌరవంగా భావిస్తున్నాను. కిరీటం కన్నా ఇది ఎక్కువ. ఇది నా విలువను, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే అవకాశాన్ని అందించింది' అని ఆమె అన్నారు. ఇక ఇదే పోటీల్లో సురినా‌మ్‌కు చెందిన లిసా అబ్లోయెల్క్ ఫస్ట్ రన్నరప్, నెదర్లాండ్స్‌కు చెందిన మాళవిక శర్మ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. 
 
అలాగే మిసెస్ కెటగిరీలో ట్రినిడాడ్‌కు చెందిన సుఅన్ మౌటెట్ విజేతగా నిలిచారు. స్నేహ నంబియార్ ప్రథమ, యూకేకు చెందిన పవన్ దీప్ కౌర్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. టీన్ కేటగిరీలో గ్వాడెలోప్‌కు చెందిన సియెర్రా సురెట్ మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. నెదర్లాండ్ నుంచి శ్రేయా సింగ్ ఫస్ట్ రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధా టెడ్జో రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ అందాల పోటీలను న్యూయార్క్‌కు ఇండియా ఫెస్టివల్ కమిటీ నిర్వహిస్తుంది. ఇండియన్ - అమెరికన్లు నీలం, ధర్మాత్మ శరణ్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయి.