ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (09:42 IST)

భారత్-పాక్‌ల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాల్లేవు: ముషారఫ్

భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ఆ ప్రచారమంతా ఉత్తదేనని ముషారఫ్ వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య 2002 నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తాయని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా గత దశాబ్దకాలంలో భారత్-పాక్ మధ్య శత్రుత్వం మరింత ఎక్కువైందని ముషారఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తన దళాలను ఉపసంహరించి తర్వాత భారత్-పాక్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని ముషారఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
యుద్ధమంటూ వచ్చి భారత్‌పై పాక్ ఒక బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుందని, అప్పుడు పాక్ మళ్లీ 50 బాంబులు వేయాల్సి వస్తుందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఇది అత్యంత ప్రమాదకరమని, అణుయుద్ధం గురించి మాట్లాడేవారికి నిజానికి దానిపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు.