Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ దుస్సాహసం..పాఠ్యాంశంగా భారత భూభాగం చేర్చిన మ్యాప్

Written By ఎం
Updated: శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:45 IST)
పొరుగునున్న నేపాల్ ప్రభుత్వం దుస్సాహసానికి దిగింది. చైనా అండ చూసుకుని మిడిసిపాటు ప్రదర్శిస్తోంది. భారత్‌తో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడుతూ, సవరించిన దేశ భౌగోళిక రాజకీయ మ్యాప్‌ను ఆ కొత్త పుస్తకాల్లో చేర్చింది.

వ్యూహాత్మకంగా కీలకమైన మూడు భారతదేశ ప్రాంతాలను నేపాల్‌ భూభాగంలో కలిపివేసినట్లుగా అందులో చూపించింది. భారతదేశానికి చెందిన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాదురా ఈ మూడు ప్రాంతాలను నేపాల్‌కు చెందినవిగా చూపిస్తున్న కొత్త రాజకీయ మ్యాప్‌ను నేపాల్‌ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల భారత్‌ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ కృత్రిమ ఆక్రమణలను తాము సహించబోమని ఖండించింది. నేపాల్‌ విద్యా శాఖకు చెందిన కరిక్యులమ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఇటీవలనే సవరించిన మ్యాప్‌తో కూడిన పుస్తకాలను ప్రచురించిందని సమాచార శాఖ అధికారి గణేష్‌ భట్టారారు తెలిపారు. 9, 12 తరగతుల సిలబస్‌లో వీటిని చేర్చారు.

అన్నీ చూడండి

Chiranjeevi : జి.వి. నారాయణరావు అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

Toxic Torture reson: టాక్సిక్ చిత్రం టార్చెర్ కు కారణం ఏమిటి ? రుక్మిణి వసంత్ పాత్రపై చర్చ

Varanasi rumors: వారణాసి ని మరిచిపోకుండా వదంతులతో ప్రచారం చేస్తున్నారా ?

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments