1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:20 IST)

భారత పర్యటనకు రానున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధిపతి వ్లాదిమిర్ పుతిన్ సోమవారం నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్ - రష్యా స్నేహబంధం 21వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
భారత్ రష్యాల దేశాల మధ్య చిరకాల స్నేహంబంధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు అధినేతల మధ్య జరిగే చర్చల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా, 200 హెలికాఫ్టర్ల తయారీపా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఆయన రష్యాకు తిరిగి బయలుదేరి వెళతారు. పుతిన గౌరవార్థం ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.