సంబంధిత వార్తలు
- యూజీసీ అదుర్స్.. ఆడపిల్లలకు స్పెషల్ స్కాలర్షిప్.. ఎలా అప్లై చేయాలి?
- అఫ్ఘన్ క్రికెట్పై తాలిబన్ల ప్రభావం.. వన్డేల సిరీస్ వాయిదా
- శవాలతో సెక్స్ చేస్తున్న తాలిబన్లు: పారిపోయి వచ్చిన మహిళ షాకింగ్ న్యూస్
- తాలిబన్లను నల్లిని నలిపినట్టు నలిపేస్తున్న గ్రామస్థులు.. ఎక్కడ?
- రండిరా చూసుకుందాం, మీ పెతాపమో మా పెతాపమో? వచ్చిన తాలిబన్లను వచ్చినట్లే చంపేస్తున్నారు
ఆప్ఘాన్ను తాలిబానిస్థాన్ కానీయం.. అమ్రుల్లా సలేహ్
ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. బగ్లాన్ ప్రావిన్సులో తాలిబన్లపై స్థానిక సాయుధ ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఉలిక్కిపడ్డ ముష్కర ముఠా.. 24 గంటల వ్యవధిలోనే ఆ జిల్లాలను తిరిగి ఆక్రమించుకొని తమదే పైచేయి అని నిరూపించుకుంది.
ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు హతమయ్యారు. మరోవైపు- కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ఘాన్ను తాలిబానిస్థాన్ కానీయమని అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ స్పష్టం చేశారు. తాలిబన్లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఉగ్రమూకలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు ప్రకటించారు. అన్దార్బ్ లోయలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని అమ్రుల్లా ట్వీట్ చేశారు. వేలాది మంది పిల్లలు, మహిళలు పర్వతాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు. అక్కడి పెద్దలను, పెద్దలను బందీలుగా మార్చుకుని మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.
