1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (17:07 IST)

బుద్ధిమార్చుకోని తాలిబన్ తీవ్రవాదులు : మహిళల వాయిస్ బంద్

ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాంతిపలుకులు పలికిన తాలిబన్ తీవ్రవాదులు.. ఆచరణలో మాత్ర తమ బుద్ధిని మార్చుకోలేదు. ఫలితంగా తమ కఠినమైన షరియా చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తున్నారు. సంగీతం లేదా పాటలు,  టీవీలు, రేడియో ఛానళ్లలో ఆడవాళ్ల వాయిస్‌ని బ్యాన్ చేయాలని కాందహార్‌లోని టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లను తాలిబన్ ఆదేశించింది. 
 
వాస్తవానికి తాము పూర్తిగా మారిపోయామని, ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు.. మహిళలు చదువుకోవచ్చు.. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు వారు అంగీకరించడం లేదు. 
 
కాగా, ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు అప్ఘానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పలు మీడియా సంస్థలు తమ ఫీమేల్ (ఆడవాళ్లు) యాంకర్లను తొలగించిన కొద్ది రోజుల్లోనే తాలిబన్ నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం. ఇక,పలువురు మీడియా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా ఇటీవల అప్ఘానిస్తాన్ వదిలి పారిపోయినట్లు సమాచారం.