1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (08:35 IST)

వారిని మహాత్ములంటారు.. భారత్ సర్కారుకు ఆప్ఘన్ ధన్యవాదాలు

ఆప్ఘనిస్థాన్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత సర్కారు 1.6 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను ప్రత్యేక విమానంలో కాబుల్‌కు సరఫరా చేసింది. ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు భారత సర్కారుకు ధన్యవాదాలు తెలిపింది. 
 
తమకు హాని కలిగించే వారికి కూడా సహాయపడే వారినే మహాత్ములంటారని, విపత్కర పరిస్థితుల్లో ఆప్ఘనిస్థాన్ పిల్లల చికిత్స నిమిత్తం భారత్ సహాయం చేసిందని ఆప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జయి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి తాము ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని రాయబారి ఫరీద్ మముంద్‌జయ్ ట్వీట్ చేశారు.
 
ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అత్యవసరమని తాలిబన్ పేర్కొంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో భారత్ వీటిని పంపడం ద్వారా కొన్ని కుటుంబాలకు ఆసరా ఇచ్చినట్టేనని ఫరీద్ మముంద్‌జయి పేర్కొన్నారు.