1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:12 IST)

మరణం అంచులకు వెళ్లిన వచ్చిన మహిళకు మానసిక ప్రశాంత.. ఎలా?

victim woman
సాధారణంగా మనిషి నుంచి ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ, మరణం అంచులకు వెళ్లి వచ్చిన ఓ మహిళకు మాత్రం మానసిక ప్రశాంత లభించిందని చెబుతుంది. ఈ విషయాలను ఆమెను పంచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అమెరికాకు చెందిన లారెన్ కెనెడే అనే మహిళ గత యేడాది అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుతో కుప్పుకూలిపోయింది. ఆమె భర్త వెంటనే అత్యవసర మెడికల్ సిబ్బందికి సమాధానం ఇచ్చి ఆమెకు సీపీఆర్ నిర్వహించాడు. ఈలోపు అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెకు దాదాపు 24 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆమె మళ్లీ ఈలోకంలోకి వచ్చేలా చేశారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు కోమాలో ఉన్నాక ఆమె స్పృహలోకి వచ్చింది. కానీ, అంతకుముందు వారం పాటు జరిగిన విషయాలన్నీ తన మెదడులోంచి తుడిచిపెట్టుకుపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. 
 
కార్డియాక్ అరెస్టుతో గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వారికి తొలి పది నిమిషాలు చాలా కీలకం. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ చేస్తే వారు మళ్లీ కోలుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ, తాజా ఘటనలో మహిళకు 24 నిమిషాల పాటు సీపీఆర్ చేశాక ఆమె మళ్లీ స్పృహలోకి వచ్చింది. 'ఆ తర్వా నన్ను ఆసుపత్రిలో ఉంచారు. రెండు రోజుల పాటు కోమాలో ఉన్నా. స్పృహలోకి వచ్చే సరికి అనేక విషయాలు మర్చపోయా. అంతకుమునుపు వారంలో జరిగిన విషయాలేవీ గుర్తులేవు. కానీ మనసంతా ప్రశాంతత ఆవరించింది. ఆ భావన చాలాకాలం పాటు అలాగే కొనసాగింది' అని ఆమె వివరించారు.