1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 మే 2025 (17:04 IST)

అసుస్ ఆర్ఓజి తాజా ఆవిష్కరణలు, జెఫైరస్- స్ట్రిక్స్ ల్యాప్‌టాప్‌లు

Asus
భారతదేశపు నంబర్ 1 గేమింగ్ బ్రాండ్ అయిన అసుస్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ఆర్ఓజి), ఎన్విడియ ఆర్టిఎక్స్ 5000 సిరీస్‌తో శక్తివంతమైన దాని 2025 ఆర్ఓజి ల్యాప్‌టాప్ శ్రేణి ఈరోజు నుండి భారత మార్కెట్లో అందుబాటులో ఉందని వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన కొత్త శ్రేణిలో అధిక-పనితీరు గల ఆర్ఓజి స్ట్రిక్స్ స్కార్ 16/18, స్ట్రిక్స్ జి 16, జెఫైరస్ జి 16, జెఫైరస్ జి 14, కన్వర్టిబుల్ ఫ్లో జెడ్ 13 ఉన్నాయి, ఇవన్నీ గేమర్‌లు, క్రియేటర్ల కోసం రూపొందించిన అత్యాధునిక పనితీరు, అధునాతన శీతలీకరణ, ఏఐ -శక్తివంతమైన సామర్థ్యాలను అందించడానికి రూపొందించబడ్డాయి.
 
కొత్త శ్రేణి గేమింగ్ ఔత్సాహికులు, సాధారణ గేమర్‌లు, నిపుణులకు తమ శైలికి అనుగుణంగా వివిధ రకాల వ్యక్తిగతీకరించిన ఎంపికలను అందిస్తుంది. ఇంటెల్ కొర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌లతో కూడిన ఆర్ఓజి  స్ట్రిక్స్ స్కార్ 16/18 సిరీస్ వరుసగా రూ. 379,990, రూ. 449,990 నుండి అందుబాటులో ఉంటాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌లతో కూడిన జెఫైరస్ జి 16 రూ. 359,990 నుండి ప్రారంభమవుతుంది, ఏఎండి రైజెన్ ఏఐ 9 హెచ్ ఎక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న జెఫైరస్ జి 14 ధర రూ. 279,990 నుండి ఉంటుంది. ఏఎండి రైజెన్ ఏఐ మాక్స్ ప్రాసెసర్‌తో నడిచే కొత్త ఫ్లో జెడ్ 13 రూ.199,990 నుండి లభిస్తుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌లను కలిగి ఉన్న స్ట్రిక్స్ జి 16 రూ. 259,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ తదుపరి తరం పోర్ట్‌ఫోలియో అసుస్ ఇ-షాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆర్ఓజి-అధీకృత రిటైలర్లు, దేశవ్యాప్తంగా అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.