గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 మే 2017 (14:04 IST)

కాగ్నిజెంట్ సుతిమెత్తని హెచ్చరిక... 9 నెలల జీతాలిస్తాం... బుద్ధిగా వెళ్ళిపోండి!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఐటీ కంపెనీలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో తమ వద్ద ఉన్న వర్క్ ఫోర్స్‌ (ఉద్యోగులు)ను తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఐటీ కంపెనీలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో తమ వద్ద ఉన్న వర్క్ ఫోర్స్‌ (ఉద్యోగులు)ను తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయాలన్న కఠిన నిర్ణయానికి వచ్చేశాయి. దీనికి నిదర్శనం ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ చేసిన సుతిమెత్తని హెచ్చరిక. 
 
‘డి ప్లస్’ కేటగిరి ఉద్యోగులకు మంగళవారం రాత్రి పంపిన మెయిల్స్‌లో సుహృద్భావ వాతావరణంలో సంస్థను విడిచిపెట్టేందుకు సిద్ధం కావాలని కోరింది. ఈ కేటగిరీలోకి డైరెక్టర్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు వస్తారు. ఉద్యోగుల కేటగిరినిబట్టి 6 లేదా 9 నెలల జీతాన్ని తీసుకుని స్నేహపూర్వకంగా సంస్థ నుంచి వెళ్ళిపోవాలని కాగ్నిజెంట్ కోరింది. డైరెక్టర్లకు 9 నెలల జీతం, ఏవీపీలు, ఎస్‌వీపీలకు 6 నెలల జీతం ఇస్తామని ప్రకటించింది.
 
దీనిపై కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. "కొందరు అర్హులైన లీడర్లకు స్వచ్ఛంద ఎడబాటు ప్రోత్సాహకాలను ఇవ్వజూపుతున్నాం. వీరు మా మొత్తం ఉద్యోగ బృందంలో అతి తక్కువ శాతం మాత్రమే ఉంటారు. అత్యున్నత ప్రమాణాలను అందజేసేందుకు, సుస్థిర వృద్ధికి, డిజిటల్‌వైపు వేగంగా మళ్ళేందుకు కంపెనీ అనుసరిస్తున్న వ్యూహానికి సంబంధించిన నిర్ణయమిది" అని పేర్కొన్నారు.