1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:32 IST)

మహిళపై 23 గ్యాంగ్ రేప్.. రోడ్డుపై నిలబడితే కిడ్నాప్ చేసి...

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఓ మహిళపై 23 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌‌లోని రిడ్‌ మల్సర్‌ పురోహిటన్‌‌కు బాధిత మహిళ వెళ్

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఓ మహిళపై 23 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌‌లోని రిడ్‌ మల్సర్‌ పురోహిటన్‌‌కు బాధిత మహిళ వెళ్లింది. ఆ స్థలాన్ని చూసుకుని తిరిగొస్తూ.. ఇంటికెళ్లేందుకు మధ్యాహ్నం పూట జైపూర్‌ రోడ్డులో ఖటూశ్యాంమందిర్‌ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఎస్యూవీ వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలోకి లాగేశారు. 
 
అక్కడికి సమీపంలోని గనుల ప్రాంతంలోకి కారుని తీసుకెళ్లి వారిద్దరూ పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై మరో ఆరుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని.. పలన అనే గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ కూడా తనపై అత్యాచారం జరిగిందని.. మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఎత్తుకెళ్లిన చోటనే వదిలి వెళ్లిపోయారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన ప్రాంతంలో కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి తెరతీసిన నిందితులను రాజు, సుభాష్‌గా గుర్తించామని, బాధితురాలికి వైద్య పరీక్షల చేయించినట్లు.. నివేదిక కోసం ఎదురచూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.