శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: గురువారం, 2 మే 2019 (16:39 IST)

మహిళా వైద్యురాలి గొంతు కోసి హత్య... 29 ఏళ్ల వైద్యుడే సర్జికల్ నైఫ్‌తో...

ఢిల్లీలోని రంజిత్ నగర్ లోని ఓ అపార్టుమెంట్లో 25 ఏళ్ల మహిళా వైద్యురాలు హత్యకు గురైంది. ఆమె శరీరంపై కత్తి గాట్లతో పాటు గొంతు కోసినట్లు వుంది. రక్తపు మడుగులో పడి వున్న ఆమె దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కరోల్ బాగ్ లోని ప్రభుత్వాసుపత్రిలో ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కి చెందిన 25 ఏళ్ల గరీమ మిశ్రాతో పాటు 29 ఏళ్ల చంద్రప్రకాష్ వర్మతో పాటు మరో వైద్యుడు కలిసి ఒకే అపార్టుమెంట్లో వేర్వేరు గదుల్లో అద్దెకు వుంటున్నారు. ఐతే మే 1వ తేదీ ఉదయం గరీమా నివాసముంటున్న అద్దె గది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పనివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా లోపల ఆమె మృతదేహం రక్తపుమడుగులో పడి వుంది. ఆమె దేహంపై పదునైన కత్తిగాట్లు వున్నాయి. ఐతే ఆమెతో పాటుగా వుంటున్న 29 ఏళ్ల వైద్యుడు వర్మ కనిపించకపోవడంతో అతడే హత్య చేసి పరారై వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి వుంటాడేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.