1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (18:56 IST)

పెద్ద నోట్ల రద్దు.. నోట్ల మార్పిడి కోసం రాహుల్ గాంధీ.. ప్రజలతో పాటు క్యూలో నిల్చున్నారు

పెద్ద నోట్ల రద్దుతో చేతిలో ఖర్చులకు డబ్బుల్లేకుండా సెలెబ్రిటీలు నానా తంటాలు పడుతున్నారు. సినీ సెలెబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా జేబులు తడుముకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల

పెద్ద నోట్ల రద్దుతో చేతిలో ఖర్చులకు డబ్బుల్లేకుండా సెలెబ్రిటీలు నానా తంటాలు పడుతున్నారు. సినీ సెలెబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా జేబులు తడుముకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాత నోట్లను మార్పు చేసుకుని.. కొత్త నోట్లను పొందేందుకు పార్లమెంటు వీధిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. సాధారణ ప్రజలతో పాటే రాహుల్ గాంధీ కూడా క్యూలో వేచి చూశారు. గంటల తరబడి క్యూలో వేచి వున్న చిల్లర బాధితులను ఆయన పరామర్శించారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నాలుగు వేల రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం వద్దకు వచ్చినట్లు తెలిపారు. నల్లధనం పేరుతో ప్రజలకు మోడీ ప్రభుత్వం నరకం చూపుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో సెల్ఫీలు తీసుకున్నారు.