శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (11:40 IST)

మ్యాట్రిమోనియల్ మోసం.. టెక్కీ అలా మోసపోయాడు..

ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఫోటో, వివరాలను వుంచి టెక్కీ మోసపోయాడు. అందమైన అమ్మాయితో అతనికి ఏర్పడిన పరిచయం కాస్త మోసపోయేందుకు కారణమైంది. ఇదంతా బెంగళూరులో చోటుచేసుకుంది. ఎవరికీ దక్కని అమ్మాయిని తానే చేసుకుంటున్నానని లోలోపల ఖుషీ అయిపోయాడు. ఫోటోలు పంపడంతో ఆకాశంలో తేలిపోయాడు. 
 
ఆ తర్వాత ఇద్దరూ వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాలింగ్స్ చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. గురుడు ఓకే అంటూ కమిట్ అయ్యాడు. ఆ తర్వాత అసలు డ్రామా మొదలు పెట్టింది. ఉన్నట్టుండి.. ఎవరికో యాక్సిడెంట్ అని ఫోన్ చేసింది. రూ.లక్ష లాగేసింది. పెళ్లి కోసం కొన్నేళ్లుగా మనీ దాస్తున్న అతను... ఆమె అడగ్గానే పూర్తి నమ్మకంతో అప్పటికప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు.
 
ఆ తర్వాత మరికొన్ని రోజులకు మరో డ్రామా. ఇలా చాలా డ్రామాలు ఆడింది. ప్రతిసారీ ఏదో ఒక కొత్త కహానీ చెప్పి... లక్షలు లాగేసింది. మొత్తం రూ.16 లక్షల 82 వేలు స్వాహా చేసింది. ఆ తర్వాత నుంచి... అతనితో మాట్లాడటం మానేసింది. అతను కాల్ చేస్తే... కట్ చేస్తోంది దీంతో తాను మోసపోయానని పోలీసులు ఆశ్రయించాడు.