గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (22:14 IST)

కాఫీ అడిగితే ఇవ్వని భార్య.. వేడి నీళ్లు పోసేసిన భర్త.. ఎక్కడ?

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళలపై గృహ హింసలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్య కాఫీ పెట్టివ్వలేదని ఓ భర్త.. ఆమెపై వేడినీరు పోసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు శివారు ప్రాంతమైన తొట్టప్పళపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త భార్య కావ్య (34). 
 
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా కుటుంబంతో ఇంట్లోనే వుంటున్నారు. ఈ నేపథ్యంలో కావ్యతో ఆమె భర్త కాఫీ పెట్టివ్వమని అడిగాడు. కానీ కావ్య కాఫీ పెట్టివ్వడం కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె భర్త ఆవేశంలో వేడినీటిని కావ్యపై పోసేశాడు. 
 
వేడి తట్టుకోలేక కేకలు పెట్టిన కావ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అదృష్టకరంగా కావ్య తేలికపాటి గాయాలతో కోలుకుంది. దీనిపై కావ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కావ్య భర్తపై చర్యలు తీసుకునేందుకు విచారణ చేపట్టారు.