ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:22 IST)

ఆర్నాబ్ గోస్వామిపై దుండగుల దాడి.. ఢిల్లీలో కలకలం

ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ టీవీ చానెల్ అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై గురువారం వేకువజామున దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. ముంబైలోని స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ దాడిలో గోస్వామి దంపతులకు ఎలాంటి గాయాలుకాలేదు. 
 
కానీ, వారు ప్రయాణిస్తున్న కారు మాత్రం దెబ్బతింది. ఈ దాడిపై అర్నాబ్‌ గోస్వామి, సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కాగా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో విశ్వసనీయత లోపించిందంటూ అర్నాబ్ గోస్వామి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసి 24 గంటలకు తిరగక ముందే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
కాగా, మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై గుంపు దాడి ఘటన నేపథ్యంలో టీవీ లైవ్‌ చర్చలో అర్నాబ్‌ తన రాజీనామాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్‌ 3 డీసీపీ ప్రకటించారు.