బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2019 (17:25 IST)

మురళీ మనోహర్ జోషీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్

భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషీ ఆస్పత్రి పాలయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖమాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కనుమూయగా ఆయన అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఈ అంత్యక్రియలు ముగిసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి అనారోగ్యం ఉండటంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. 
 
తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 
 
కాగా, జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలాగే, గత యేడాది కాలంలో వాజ్‌పేయి నుంచి జైట్లీ వరకు అనేక మంది అగ్రనేతలు చనిపోయారు.